Air India | ఎయిర్ ఇండియా మొత్తం అప్పులు రూ.61,562 కోట్లు.. వీటికి చమురు కంపెనీలకు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, ఇతర వెండర్లకు చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు రూ.15,834 కోట్లు అదనం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఏండ్ల తరబడి ఎయిర్ ఇండియా యాజమాన్యం ఈ బిల్లుల చెల్లింపులు వాయిదా వేయగలిగింది. అంతే కాదు.. మరో ప్రభుత్వ రంగ సంస్థ బాల్మేర్ లావ్రై ద్వారా కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కొనుగోలు చేసిన టికెట్ల బిల్లుల చెల్లింపుల్లోనూ కేంద్రం తరుచుగా ఎడతెగని జాప్యం చేస్తూ వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయితే వివిధ రకాల బకాయి బిల్లులు.. ఎయిర్ ఇండియా ఆస్తులు, పెయింటింగ్స్, ఇతర నాన్కోర్ ఆస్తులన్నీ త్వరలో కొత్త కంపెనీ ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ కంపెనీ ఆధీనంలోకి రానున్నాయి. కేవలం టాటా సన్స్కు ఎయిర్ ఇండియా విక్రయంతోనే ప్రభుత్వ బాధ్యత పూర్తి కాలేదు.. రోజువారీ కార్యకలాపాలను గాడిలో పెట్టాల్సి ఉంటుందని ఓ అధికారి చెప్పారు.
ఎయిర్ఇండియా అసెట్ హోల్డింగ్ కంపెనీ ఆధీనంలోకి రానున్న ఆస్తులను మార్కెట్లో పరిస్థితులను బట్టి ప్రభుత్వం నగదీకరించనున్నదని సమాచారం. ఇక రుణాల చెల్లింపులపై సంబంధిత బ్యాంకులతో కేంద్రం కలిసి అంగీకారానికి రావాల్సి ఉంటుంది. రుణాలకు 94 శాతం హామీ కేంద్రమే కనుక వాటి చెల్లింపులపై ఒక అవగాహనకు రావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
అప్పులు, బిల్లుల బకాయిలు తదితరాలు కలిపి మార్చి నాటికి ఎయిర్ ఇండియాకు సుమారు రూ.84 వేల కోట్ల నష్టాలు వచ్చాయని అంచనా. ఇక వచ్చే డిసెంబర్ నాటికి కొత్త యాజమాన్యానికి ఎయిర్ఇండియాను బదిలీ చేసేవరకు సంస్థపై పడే ఆర్థిక భారాన్ని కేంద్రమే భరించాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మూడో విడత : స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాల వెల్లడి!
Petrol Price | దాదాపు అన్ని రాష్ట్ర రాజధానుల్లో సెంచరీ దాటిన పెట్రోల్
MG Motors : భారత్లో మరో ఎస్యూవీ లాంఛ్ చేసిన ఎంజీ..ధర ఎంతంటే!
India Faces Blackout | అంధకారం అంచుల్లోకి భారత్.. తగ్గిన విద్యుద్యుత్పత్తి!