న్యూఢిల్లీ, జూలై 5: మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీలో కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో 4 శాతం వాటాను విక్రయించనుంది. షేరుకు రూ.165 చొప్పున ఈ ఆఫర్కు ఫ్లోర్ ధరగా నిర్ణయించారు. ఈ ఓఎఫ్ఎస్కు సబ్స్క్రిప్షన్లు మంగళవారం ప్రారంభమవుతాయని ఎన్ఎండీసీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. జూలై 6న నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకు, జూలై 7న రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ అందుబాటులో వుంటుంది. ఈ కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 68.29 శాతం వాటా వుంది. 4 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,800 కోట్లు సమకూరవచ్చు.