న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపు అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. మంగళవారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రూ.2,46,519.82 కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. ఇదే సమయానికి గతేడాది రూ.1,17,787.87 కోట్లు వసూలయ్యాయి.
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు తదితరుల నుంచి సానుకూల సెంటిమెంట్తో పన్ను వసూళ్లు పెరిగాయని పంకజ్ చౌదరి చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో పన్ను వసూళ్లపై ఇప్పుడిప్పుడే స్పందించలేమన్నారు. సెకండ్ క్వార్టర్ ఇప్పుడే ప్రారంభమైందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరోక్ష పన్ను వసూళ్లు రూ.3,11,398 కోట్లకు చేరాయన్నారు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి.