అమరావతి : తిరుమల శ్రీవారి ఆలయంలో వంశపారంపర్య అర్చకులను నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 3 కుటుంబాలకు చెందిన 8 మందిని వంశపారంపర్య అర్చకులుగా నియమించింది. మిరాశి వంశస్తుల్లో కొత్త తరానికి అర్చకత్వ బాధ్యతలను టీటీడీ అప్పగించింది. కొత్త అర్చకులుగా ఏఎస్కేఎన్ దీక్షితులు, ఏఎస్కేఆర్సీ దీక్షితులు, కృష్ణచంద్ర దీక్షితులు, భరద్వాజ దీక్షితులు, ప్రశాంత్ శ్రీనివాస దీక్షితులు, శీహర్ష శ్రీనివాస దీక్షితులు, ఏటీఆర్ రాహుల్ దీక్షితులు, ఏటీ శ్రీనివాస దీక్షితులు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.