న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి కలిగించేందుకు కేంద్రం మరికొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించనున్నది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణ్యం చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ నేపథ్యంలోనే తాజా ఉద్దీపన ప్యాకేజీ వెలువడనున్నదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
గత రెండు నెలల్లో కరోనా రెండో వేవ్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉందని కొన్ని పారిశ్రామిక సంస్థలు చేసిన డిమాండ్పై సుబ్రమణ్యం పై విధంగా అన్నారు.
కరోనా రెండో వేవ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రూ.2 లక్షల కోట్ల మేరకు నష్టపోయిందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంటుందని సుబ్రమణ్యం అన్నారు.