వినియోగదారుల పట్ల కేంద్రం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నదా.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. దేశీయ అవసరాల నిమిత్తం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి శనివారం ఆదేశాలు జారీ చేశారు. అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు తగ్గనున్నాయి. అయితే, నెల రోజుల్లోపు దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలపై సుంకాలు తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం.
ఖరీఫ్ సీజన్లో పంటల దిగుబడి బాగానే ఉంటుందన్న అంచనాలతోపాటు అంతర్జాతీయంగా తగ్గిన ధరలు దీనికి కారణమని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఇంతకుముందు దిగుమతి సుంకాల తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఈ నెలాఖరుతో ముగిసిపోనున్నది. ఈ నేపథ్యంలోనే మరోమారు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.
కేంద్రం నిర్ణయం ప్రకారం అన్ని రకాల ముడి వంట నూనెల దిగుమతిపై కస్టమ్స్ సుంకం, అదనపు ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ సెస్ 24.75 శాతంగా ఉంటుంది. రిఫైండ్ ఆయిల్స్పై దిగుమతి సుంకం 35.75 శాతం ఉంటుంది. ముడి పామాయిల్పై దిగుమతి సుంకం 10% నుంచి 2.5 శాతానికి, ముడి సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్పై ఉన్న 7.5% సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించింది. 60 దేశాల నుంచి కేంద్రం వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నది.
ఇంతకుముందు పప్పు ధాన్యాలపై దిగుమతి సుంకాలు తగ్గించిన కేంద్రం.. ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లే వంట నూనెల ధరలను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయ తలపెట్టింది. ట్రేడర్లు, హోల్సేల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న వివిధ రకాల నూనెల నిల్వల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రం వంట నూనెల దిగుమతిపై సుంకాలు తగ్గించడం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
IT Returns | బిగ్ రిలీఫ్.. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించిన కేంద్రం
RBI rule on ATM | గ్రామీణులకు షాక్.. ఏటీఎంలు ఎత్తేస్తున్న బ్యాంకులు?!