న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు పిల్లలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాల్పడుతున్న 8 లక్షల యాప్లను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నిషేధించాయి. 2021 ప్రథమార్థంలో తొలగించిన మొబైల్స్ యాప్స్ నివేదిక పేరుతో పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది తొలి అర్థభాగంలో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ 8.13 లక్షలకు పైగా యాప్లను నిషేధించిందని తెలిపింది.
తొలగించిన యాప్స్కు సుమారు 2.1 కోట్ల యూజర్ల రివ్యూలు నమోదయ్యాయని వెల్లడించింది. కనుక ఇప్పటికి ఆ యాప్లను కస్టమర్లు వాడే చాన్స్ ఉన్నదని పిక్సలేట్ పేర్కొంది. కనుక స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్ల ప్లే స్టోర్లలో ఒకసారి చెక్ చేసుకుని సదరు యాప్స్ను తొలగించాలని వెల్లడించింది.