న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.48 తగ్గి రూ.47,814కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,862 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు ఫ్లాట్గా ముగియడమే దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండటానికి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధర కూడా ఇవాళ స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర రూ.340 పెరిగి రూ.70,589కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.70,249 వద్ద ముగిసింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,859 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.78 అమెరికన్ డాలర్లు పలికింది.