సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (103) సెంచరీతో అదరగొట్టగా, ఇమాముల్ హక్(70) అర్ధసెంచరీతో రాణించాడు. తొలుత వాండర్ డస్సెన్ (123 నాటౌట్) అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 273/6 స్కోరు చేసింది.