కడ్తాల్, మే 30 : కరోనా బారిన పడిన పేదలందరికీ అండగా ఉంటానని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మండలంలో బాధితుల్లో ఆత్మైస్థెర్యం నింపేందుకు జడ్పీటీసీ దశరథ్నాయక్ ‘మీ కోసం-మీ జడ్పీటీసీ’ భరోసాయాత్రను చేపట్టారు. ఆదివారం మండల పరిధిలోని గడ్డమీదితండాలో జడ్పీటీసీ వైద్య బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జడ్పీటీసీ మాట్లాడుతూ పేదలకు నిత్యావసరాల సరుకులు, కూరగాయలు, మెడికల్ కిట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమణ, నాయకులు రాఘవచారి, పంతూనాయక్, రవి, రమేశ్, బన్సీలాల్, భీక్యానాయక్, సోమ్లానాయక్, జగన్నాయక్ పాల్గొన్నారు.
పంచాయతీ సిబ్బందికి సరుకులు
యాచారం, మే 30 : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా నిత్యం విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బందికి యాచారం, మేడిపల్లి, మాల్, తక్కళ్లపల్లి గ్రామాల్లో ఆదివారం నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశారు. యాచారంలో డిప్యూటీ తహసీల్దార్ జంగయ్య పంచాయతీ సిబ్బందికి 25 కిలోల బియ్యంతో పాటుగా నిత్యావసర సరుకులు అందజేశారు. మండల కేంద్రంలో బీజేవైఎం మండలాధ్యక్షుడు భూతరాజు నాగరాజు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. మేడిపల్లిలో బీజేవైఎం నాయకుడు శివ పంచాయతీ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశాడు. తక్కళ్లపల్లిలో ఉపసర్పంచ్ శ్రీశైలం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జంగయ్యగౌడ్, శేఖర్, విజయ్నాయక్, శాంతికుమార్, యాదయ్య తదితరులున్నారు.