న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధర మరింత పెరిగింది. ఇవాళ ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.527 పెరిగి రూ.48,589కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,062 వద్ద ముగిసింది. అంతర్జాతీయ స్థాయిలో విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరుగడమే దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఇవాళ పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,043 పెరిగి రూ.71,775కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.70,732 వద్ద ముగిసింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,908 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 28.07 అమెరికన్ డాలర్లు పలికింది.