బంజారాహిల్స్, మార్చి 19: దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం స్టడీస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్లో ‘బయోస్కోప్’ పేరుతో యురోపియన్ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. మూడురోజుల పాటు కొనసాగే ఈ ఫిలిం ఫెస్టివల్ను తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ప్రసాద్ ల్యాబ్స్లో హంగేరియన్ సినిమా ‘ది ట్రూ ప్’. పోర్చుగల్ సినిమా ‘డయామాంటినో’, ఆస్ట్రియన్ సినిమా ై‘స్టెక్స్’లను ప్రదర్శిస్తున్నారని దిల్ రాజు తెలిపారు. ఇలాంటి ఫిలిం ఫెస్టివల్ వల్ల యువ దర్శకులు, సాంకేతి క నిపుణులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారని, మరింత సృజనాత్మకతతో సినిమాలు తీసే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.