వరంగల్/నల్లగొండ,మార్చి16 (నమసే ్తతెలంగాణ, ప్రతినిధులు): వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రా డ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం నల్లగొండ పట్టణంలోని హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలలో ఏర్పా ట్లు పూర్తయ్యాయి. నేడు ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. రాత్రి 8వరకు బ్యాలెట్ పత్రాల బండిలింగ్ (కట్టలు కట్టే ప్రక్రియ) కొనసాగనుంది. అనంతరం అసలు లెక్కింపు మొదలవుతుంది. ఒక్కో రౌండ్లో 56వేల ఓట్ల చొప్పున ప్రథమ ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు. ఇలా మొత్తం ఏడు రౌండ్లలో పోలైన 3,86,320 ఓట్లు లెక్కించనున్నారు. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయ్యి కోటా నిర్ధారణ అయ్యే సరికి గురువారం ఉదయం ఆరు గంటలు కావచ్చని అంచనా. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవ్వరికీ గెలు పు కోటా రాకుంటే ఎలిమినేషన్ ప్రక్రియలో తదుపరి లెక్కింపు కొనసాగుతుంది. తొలి ప్రాధాన్యతా ఓట్లలో చివరి స్థానాల్లో ఉన్న అభ్యర్థులను వరుసగా ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యతా ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కలుపుతూ వస్తారు. గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు ఎవరో ఒక అభ్యర్థికి వచ్చే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రక్రియ అంతా గురువారమే కొనసాగనుంది. ఇక ఓట్ల లెక్కింపు ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పూర్తిగా సీసీ టీవీల పర్యవేక్షణలో నిఘా కొనసాగనుంది. మరోవైపు కౌంటింగ్ కోసం మంగళవారం సాయంత్రం నుంచే నల్లగొండ జిల్లా కేంద్రంలో సందడి మొదలైంది.
ఎనిమిది హాళ్లలో 56టేబుళ్లు కౌటింగ్ కోసం వేశారు. ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 56టేబుళ్లపై నిరాటంకంగా లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. రెండు రోజుల సమయం పట్టే అవకాశముండగా అధికారులు మూడు షిప్టులుగా సిబ్బందిని నియమించారు. సమయంతో సంబంధం లేకుండా తొలి షిఫ్టులో విధులకు హాజరయ్యే సిబ్బంది బ్యాలెట్ల పత్రాలు కట్టలు కట్టే కార్యక్రమం ముగిసే వరకు ఉంటారు. రెండో షిఫ్టు సిబ్బంది తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు, మూడో షిఫ్టు సిబ్బంది ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసి విజేత తేలే వరకు విధులు నిర్వర్తిస్తారు. కౌంటింగ్ ఏజెంట్లకు కూడా మూడు షిప్టుల వారీగా పాసులు జారీ చేశారు. మొత్తం 731 బ్యాలెట్ బాక్స్లుండగా, ఒక్కో టేబుల్కు 13 బ్యాలెట్ బాక్స్లు కేటాయిస్తారు. వీటిని ఓపెన్ చేసి ముందుగా 25 పత్రాలకు ఒక కట్టలా కడుతూ ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రమ్స్లో వేస్తారు. ఈ ప్రక్రియ సుమారు 10 నుంచి 12 గంటల పాటు కొనసాగవచ్చని అంచనా.
బుధవారం రాత్రి 8గంటల నుంచి తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు మొదలుపెడుతారు. ఒక్కో టేబుల్కు 40బండిల్స్ చొప్పున పంపిణీ చేసి మొత్తం వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. మొత్తం ఏడు రౌండ్లు కొనసాగనుండగా ఒక్కో రౌండ్కు కనీసం గంట నుంచి గంటన్నర సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. ఇదంతా పూర్తయ్యే సరికి గురువారం ఉదయం ఆరు గంటలు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి ప్రాధాన్యతా ఓట్లు పూర్తయ్యే సరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపై, చెల్లని ఓట్లపై స్పష్టత రానుంది. చెల్లిన ఓట్లలో 50శాతం+1 ఓటు గెలుపు కోటా కానుంది. అప్పటికీ ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకుంటే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెడతారు. అయితే మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశముంది.
రెండు రోజుల పాటు జరిగే ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ హాల్ వెలుపల, లో పల కలిపి మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి, కిలోమీటర్ పరిధిలో 144సెక్షన్ విధించారు. కౌంటింగ్ హాల్ చుట్టూ భద్రత ఏర్పాట్లతో పాటు పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తారు. కౌంటింగ్ హాల్ ఆవరణ, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రత చివరి వరకూ కొనసాగనుంది.