న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు పైపైకే పోతున్నాయి. రోజూ క్రమం తప్పకుండా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.411 పెరిగి రూ.47,291కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,880 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పెరుగడమే దేశీయంగా బంగారం ధరలు పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.338 పెరిగి రూ.68,335కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,997 వద్ద ముగిసింది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,787 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 26.08 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మాకు మెడిసిన్ పనిచేయదు.. పెగ్గే పని చేస్తుంది.. వీడియో
బావ ముఖేశ్కు బర్త్డే విషెష్ చెప్తూ టీనా అంబానీ పోస్ట్..!
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ప్రముఖ రచయిత వెంకటసుబ్బయ్య కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
కరోనాతో విద్యాశాఖ మాజీ మంత్రి కన్నుమూత
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య