న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.196 పెరిగి రూ.45,746కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ మరికొంత బలహీనపడటం దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.319 పెరిగి రూ.59,608కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.59,289 వద్ద ముగిసింది. అయితే, హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.230 తగ్గి రూ.47,230కి చేరింది. అదేవిధంగా 22 క్యారట్ బంగారం ధర రూ.200 తగ్గి రూ.43,300గా ఉన్నది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,776 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.72 అమెరికన్ డాలర్లు పలికింది.