న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.169 పెరిగి రూ.46,753కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,584 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ కాస్త బలహీనపడటం దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఢిల్లీలో స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.396 పెరిగి రూ.66,080కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.65,684 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,808 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.32 అమెరికన్ డాలర్లు పలికింది.