న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దాడి చేసినా.. బంగారం పట్ల ఇండియన్ల మోజు తగ్గలేదు. సరికదా.. భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)తో పోలిస్తే ఈ ఏడాది (2021-22) ప్రథమ త్రైమాసికంలో బంగారం దిగుమతులు ( Gold Imports ) పలురెట్లు పెరిగాయి.
ఏప్రిల్-జూన్ త్రైమాసికం మధ్య 7.9 బిలియన్ల డాలర్ల (రూ.58,572.99 కోట్లు) విలువ గల బంగారం దిగుమతి అయ్యింది. గతేడాది ఇదే సమయానికి కేవలం 688 మిలియన్ల డాలర్ల (రూ.5,208.41 కోట్లు) విలువైన పసిడి దిగుమతి జరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అయితే, వెండి దిగుమతులు మాత్రం 93.7 శాతం తగ్గుముఖం పట్టి 39.4 మిలియన్ల డాలర్లకు చేరాయి. బంగారం దిగుమతులు పలు రెట్లు పెరిగిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరంట్ ఖాతా లోటు (సీఏడీ) విస్త్రుతమైంది. ఏప్రిల్-జూన్ మధ్య క్యాడ్ 31 బిలియన్ల డాలర్లకు పెరిగింది.
జ్యువెల్లరీ పరిశ్రమకు డిమాండ్ ఉండటంతో ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశంగా భారత్కు పేరుంది. ప్రతియేటా దేశంలోకి 800-900 టన్నుల బంగారం దిగుమతి అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో జెమ్స్ అండ్ జ్యువెల్లరీస్ ఎగుమతులు 9.1 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో 2.7 బిలియన్ డాలర్ల విలువైన జెమ్స్ అండ్ జ్యువెల్లరీస్ ఎగుమతి చేశారు.
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?