అమరావతి : కారు అదుపుతప్పి బోల్తాపడటంతో మచిలీపట్నం ఏఆర్ సీఐ అత్త మృతి చెందగా.. ఆయనతోపాటు భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్ జిల్లా చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం వద్ద బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. మచిలీపట్నంలో ఏఆర్ సీఐగా విధులు నిర్వహించే సీఐ చంద్రశేఖర్ ఉదయం వ్యక్తిగత పనులపై తన భార్య, అత్తతో కలిసి నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి కారులో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఇర్లపాడు రోడ్డు వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తాపడటంతో చంద్రశేఖర్ అత్త తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. చంద్రశేఖర్ దంపతులకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వీరిద్దరి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.