న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.116 తగ్గి రూ.48,772కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం రూ.48,888 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా తగ్గడమే దేశీయంగా బంగారం ధర తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,291 తగ్గి రూ.70,836కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.72,127 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,898 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.74 అమెరికన్ డాలర్లు పలికింది.