న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.388 తగ్గి రూ.47,917కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,305 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర స్వల్పంగా తగ్గడమే దేశీయంగా బంగారం ధర తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
వెండి ధర కూడా ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.920 తగ్గి రూ.69,369కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.70,289 వద్ద ముగిసింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,300, 22 క్యారట్ (916) బంగారం ధర రూ.46,100 గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం 1,870 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 27.35 అమెరికన్ డాలర్లు పలికింది.