తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.231 తగ్గి రూ.48,421కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,652 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లలో వీక్ ట్రెండ్ కారణంగా ఇవాళ దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా దేశీయంగా స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.256 తగ్గి రూ.65,614కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.65,870 వద్ద ముగిసింది. ఇదిలావుంటే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,850.50 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.41 అమెరికన్ డాలర్లు పలికింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మేడిన్ ఇండియా వ్యాక్సిన్ తీసుకున్న నేపాల్ ఆర్మీ చీఫ్
- బాలిక డ్రెస్ పట్ల అభ్యంతరం.. స్కూల్ నుంచి ఇంటికి పంపివేత
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు