న్యూఢిల్లీ: బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.212 తగ్గి రూ.47,308కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,520 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు తగ్గడమే ఇవాళ దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధర కూడా ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.973 పెరిగి రూ.70,646కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.71,619 వద్ద ముగిసింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,834 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 27.34 అమెరికన్ డాలర్లు పలికింది.