పీఎసీఎస్ చైర్మన్లు చిన్నారెడ్డి, సుధీర్రావు, నర్సయ్య యాదవ్
గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రుద్రంగి, మే 3: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, మానాల పీఎసీఎస్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి పేర్కొన్నారు. మానాలలో సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం వారు ప్రారంభించి, మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తూ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. అన్నదాతలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయిం చి మద్దతు ధర పొందాలన్నారు. కేంద్రాల వద్ద రైతులు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఇక్కడ సర్పంచ్ అల్లూరి మానస, నాయకులు దేగావత్ తిరుపతి, కొడూరి రమేశ్, బాదనవేని రాజారాం, జక్కు మోహన్, జూల భూమయ్య, పీఎసీఎస్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు సంతోషకరం
ఎల్లారెడ్డిపేట, మే 3: కష్టకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం సంతోషకరమని తిమ్మాపూర్ పీఏసీఎస్ చైర్మన్ రామగిరి సుధీర్రావు పేర్కొన్నారు. తిమ్మపూర్లోని కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. సర్పంచ్ పడిగెల రవీందర్, ఎంపీటీసీ వరద బాబు, పీఏసీఎస్ డైరెక్టర్ కరికె శ్రీనివాస్, రాజయ్య ఉన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
గంభీరావుపేట, మే 3: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి సింగిల్విండో చైర్మన్ భూపతి సురేందర్ పేర్కొన్నారు. రాజుపేటలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఇక్కడ సర్పంచ్ అల్లె సత్యం, డైరెక్టర్ భగవంతరావు, ఉపసర్పంచ్ కిష్టయ్య, సీఈవో జోగు రాజయ్య ఉన్నారు.
నిబంధనలు పాటించి కొనుగోళ్లు
కోనరావుపేట, మే 3: కరోనా నిబంధనలు పాటించి ధాన్యం కొంటు న్నామని కోనరావుపేట పీఏసీఎస్ చైర్మన్ బండ నర్సయ్యయాదవ్ పేర్కొన్నారు. నిమ్మపల్లి కొనుగోలు కేంద్రం వద్ద మాస్క్లను పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కొంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ గోగు భార త, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గోగు ప్రతాపరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు.