న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 149 తగ్గి రూ.44,350కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,499 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు రాత్రికిరాత్రి తగ్గుముఖం పట్టడమే దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
దేశంలో కిలో వెండి ధర ఇవాళ రూ.866 తగ్గి రూ.64,607కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.65,473 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో తాజాగా ఔన్స్ బంగారం ధర 1,729 అమెరికన్ డాలర్లు పలుకగా.. ఔన్స్ వెండి ధర 25.12 అమెరికన్ డాలర్లు పలికింది.