న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు చాలా రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ రెండు లోహాల ధరల్లో భారీ హెచ్చుతగ్గులేమీ చోటుచేసుకోలేదు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర (Gold price ) రూ.36 తగ్గి రూ.45,888కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.45,924 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ కాస్త బలపడటమే ఇవాళ దేశీయంగా బంగారం ధరల స్వల్ప తగ్గుదలకు కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో మార్కెట్లో కిలో వెండి ధర రూ.73 తగ్గి రూ.61,911కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.61,838 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,788 అమెరికన్ డాలర్లు పలుకగా, వెండి ధర 23.68 అమెరికన్ డాలర్లు పలికింది.