న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. రోజూ కొద్దికొద్దిగా పెరుగుతూ మళ్లీ రూ.46 వేల మార్కును దాటేసింది. గత ఏడాది ఆగస్టులో అత్యధికంగా రూ.56 వేలు పలికిన పసిడి ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.44 వేల దిగువకు చేరింది. ఆ తర్వాత మళ్లీ మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నది. ఇవాళ కూడా ఢిల్లీలో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.97 వేలు పెరిగి రూ.46,257కు చేరింది.
కాగా, క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,160 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కాస్త బలహీన పడటమే దేశంలో బంగారం ధరలు పెరుగడానికి కారణమని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక వెండి ధరలు మాత్రం ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో కలో వెండి రూ.275 తగ్గి రూ.66,253కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,528 వద్ద ముగిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?