న్యూఢిల్లీ: ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత నెలతో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.8,186.51 కోట్ల నికర లాభం గడించింది. ఇది 2019-20 ఆర్థిక సంవత్సరం తుది త్రైమాసికంలో సముపార్జించిన లాభంతో 18.1 శాతం ఎక్కువ.
2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.6,927.69 కోట్ల నికర లాభం సంపాదించింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (డిసెంబర్ నెలతో ముగిసిన)లో బ్యాంక్ నికర లాభం 6.5 శాతం తగ్గి రూ.8,758.29 కోట్లకు పడిపోయింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్థూల మొండి బాకీలు 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.32 శాతం పెరిగాయి. గతేడాది మూడో త్రైమాసికంలో 0.81 శాతం పెరిగాయి. అయితే, బ్యాంకు నికర మొండి బాకీలు 0.40 శాతంగా నిలిచాయి.
గత నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరలో తమ డిపాజిట్ల పునాది సుమారు రూ.13.35 లక్షల కోట్లకు పెరిగిందని ఇంతకుముందు స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన నివేదికలో తెలిపింది.
ఇది 2019-20తో పోలిస్తే 16.3 శాతం ప్రగతిని నమోదు చేసింది. సేవింగ్స్ ఖాతాలు 27 శాతం పెరిగి నాలుగో త్రైమాసికంలో రూ.6.15 లక్షల కోట్లకు పెరిగాయి.
స్మార్ట్గా దోపిడీ.. రూ.5 లక్షలు చోరీ
బ్యాంక్ అలర్ట్ : ఆదివారం ఆర్టీజీఎస్ సేవలకు బ్రేక్!
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
చౌక వడ్డీకే బంగారం లోన్.. ఈ బ్యాంకుల్లోనే..!
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు