Srinagar-Sharjah | శ్రీనగర్ నుంచి షార్జాకు డైరెక్ట్ విమాన సర్వీస్ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఈ సర్వీస్ను ప్రారంభించారు. వాడియా గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలోని గో ఫస్ట్ సంస్థ విమానం ఏ320 నియో ఎయిర్బస్.. శ్రీనగర్లోని షేక్ ఉల్ ఆలం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లింది. ప్రతి వారం గోఫస్ట్ సంస్థ నాలుగు విమానాలను శ్రీనగర్-షార్జా మధ్య నడుపుతుంది.
శ్రీనగర్-షార్జా మధ్య నేరుగా విమాన సర్వీసు ప్రారంభించడంతో పర్యాటక రంగ పురోభివృద్ధికి దోహద పడుతుందని గో ఫస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. అంతే కాదు శ్రీనగర్-షార్జా మధ్య ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ లింక్లు బలోపేతం అవుతాయి. ఈ సర్వీస్ చండీగఢ్, ఢిల్లీ, జమ్ము, లేహ్, ముంబై నగరాలను అనుసంధానిస్తుందని గో ఫస్ట్ పేర్కొంది.