న్యూఢిల్లీ: భారత వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం కరణం మల్లీశ్వరికి తగిన గౌరవం లభించింది. దేశంలోని తొలి స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఢిల్లీ)కి మొదటి వైస్ చాన్స్లర్గా ఆమె నియమితురాలైంది. ఈ మేరకు ఢిల్లీ ఉన్నత విద్య సంచాలకులు అజ్మిల్ హక్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. త్వరలోనే విశ్వవిద్యాలయం వీసీగా మల్లీశ్వరి బాధ్యతలు చేపట్టే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ మాజీ వెయిట్లిఫ్టర్ సిడ్నీ (2000) ఒలింపిక్స్లో కాంస్యంతో చరిత్ర సృష్టించింది. వెయిట్లిఫ్టింగ్లో భారత్ తరఫున పతకం గెలిచిన తొలి ప్లేయర్గా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.