హైదరాబాద్, ఆగస్టు 13: జీఎమ్మార్ ఇన్ఫ్రా క్రమంగా నష్టాలను తగ్గించుకుంటున్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.318 కోట్ల కన్సాలిడేటెడ్ నికర నష్టం వచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది. 2020-21 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.834 కోట్ల నష్టంతో పోలిస్తే సగానికి సగం తగ్గినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. కానీ, సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,224 కోట్ల నుంచి రూ.1,879 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. వీటిలో విమానాశ్రయాల నిర్వహించడంతో రూ.898 కోట్ల ఆదాయం సమకూరగా, విద్యుత్ వర్టికల్ నుంచి రూ.446 కోట్లు లభించాయి.