వైభవంగా రథపటోత్సవం
యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్సేవ
యాదాద్రి, మార్చి12: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగం గా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శివాలయం లో శుక్రవారం 5వ రోజు వేదమూర్తులైన బ్రాహ్మణొత్తము లచే, నిత్యహవనం, శివ పంచాక్షరి జపాలు, నందీశ్వర పా రాయణాలు, పంచసూక్త పఠనం నిర్వహించారు. మూల మంత్రజపం, వివిధ పారాయణాలు పారాయణీకులు గా వించారు. అనంతరం యజ్ఞబ్రహ్మ ఆధ్వర్యంలో లక్ష బిల్వా ర్చన అత్యంతవైభవంగా నిర్వహించారు. నిత్య స్మార్తాగమ ఆరాధనల అనంతరం స్వామి, అమ్మవార్ల రథ పటోత్సవ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. పర్వత వర్థనీ సమేత రామలింగేశ్వరుల రథ-దర్శనం ముక్తిప్రదం. ఈ వే డుకలను స్మార్తాగమ సంప్రదాయాలనుసారంగా నిర్వ హించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నర సింహమూర్తి, కార్యనిర్వహణాధికారి గీత, ప్రధానార్చకు లు, అర్చక బృందం, సహాయ కార్యనిర్వహణాధికారులు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రిలో అమ్మవారికి ఊంజల్సేవ..
లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయం త్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పర మ పవిత్రంగా మహిళాభక్తులు పాల్గొనే ఊంజల్ సేవలో వేలాది మంది భక్తులు పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే శ్రీలక్ష్మి అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫా లుగా 516 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారా యణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసి న 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చ న జరిపారు. ముతయిదువులు మంగళహారతులతో అమ్మ వారిని స్థుతిస్తూ,పాటలు పాడుతూ సేవ ముందు నడిచా రు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మంటపంలోని ఊయలలో శయనింపు చేయించా రు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొని యాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. అష్టోత్త ర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఖజానాకు రూ. 9,03,598 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,03,598 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 57,972, రూ. 100 దర్శనాలతో రూ.33,200, కైంకర్యాల ద్వారా రూ. 4,002, సుప్రభాతం ద్వారా రూ.600, ప్రచార శాఖతో రూ.300, క్యారీ బ్యాగులతో రూ.4,000, సత్యనారాయ ణ వ్రతాలతో రూ.35,500, కల్యాణకట్టతో రూ.24,620, ప్రసాద విక్రయాలతో రూ.5,07,810, శాశ్వత పూజలతో రూ.24, 348, వాహన పూజలతో రూ.8,200, టోల్గేట్ ద్వారా రూ.1,070, అన్నదాన విరాళంతో రూ. 2,932, సువర్ణ పుష్పార్చనతో రూ.57,516, యాదరుషి నిలయం తో రూ.51,100, పుష్కరిణితో రూ.500, శివాలయం ద్వారా రూ. 21,512, పాతగుట్టతో రూ.12,900, ఇతర విభాగాలతో రూ.55,516తో కలిపి స్వామికి రూ. 9,03, 598 ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.