న్యూఢిల్లీ, ఆగస్టు 28:రిలయన్స్ రిటైల్తో కుదిరిన రూ.24,714 కోట్ల ఒప్పందానికి బ్రేక్వేస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని ఫ్యూచర్ రిటైల్ శనివారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. రిలయన్స్తో డీల్ జరగకపోతే తాము దివాలా తీస్తామని, బ్యాంకుల నుంచి, బాండ్ల జారీద్వారా సమీకరించిన రూ.28,000 కోట్ల ప్రజాధనం రిస్క్లో పడుతుందని, 35,000మందికి పైగా ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతారని ఫ్యూచర్ రిటైల్ ఆ పిటిషన్లో వివరించింది.
జరిగిందిదీ…
రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ రిటైల్లు విలీనానికి కుదుర్చుకున్న రూ.24,731 కోట్ల డీల్ను వ్యతిరేకిస్తూ అమెజాన్ సింగపూర్ కోర్టు నుంచి తెచ్చుకున్న ఎమర్జన్సీ ఆర్బిట్రేటర్ (ఈఏ)అవార్డు సరైనదేనని, భారత్లో అమలుచేయవచ్చంటూ మార్చిలో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువడింది. ఆ తీర్పు అమలు కోరుతూ అమెజాన్ సుప్రీంను ఆశ్రయించగా, ఆవార్డును సమర్థిస్తూ ఆగస్టు 6న రూలింగ్నిచ్చింది. విదేశంలో ఇచ్చిన ఈఏ భారత చట్ట ప్రకారం వర్తించబోదంటూ ఫ్యూచర్ గ్రూప్ కోర్టుల్లో వాదిస్తున్నది.
వివాదం ఇదీ…
కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్లోని అన్లిస్టెడ్ కంపెనీ ఒకదానిలో అమెజాన్ 49 శాతం వాటా కొన్నది. 2019వ సంవత్సరంలో ఈ డీల్ జరిగింది. లిస్టెడ్ కంపెనీ అయిన ఫ్యూచర్ రిటైల్లో కొద్ది సంవత్సరాల తర్వాత వాటాను కొనే హక్కుల్ని పొంది, అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్లో ఆ పెట్టుబడులు చేసింది. గతేడాది అక్టోబర్లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ రిటైల్ను విలీనం చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్తో రూ.24,731 కోట్ల డీల్ను కిషోర్ బియాని కుదుర్చుకున్నారు. అమెజాన్ ఈ డీల్ను వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం మొదలుపెట్టింది. వెనువెంటనే సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు నుంచి ఈఏ ఆవార్డు పొందింది.