న్యూఢిల్లీ, జూలై 27: జీఎమ్మార్ గ్రూప్తో ఫ్రాన్స్కు చెందిన గ్రూపే ఏడీపీ పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మంగళవారం జరిగిన ఈ ఒప్పందం ప్రకారం ప్రయాణీకులు, ఎయిర్లైన్స్ కోసం ఇరు సంస్థలు తమ సాంకేతికత, నైపుణ్యం, వనరులను పరస్పరం వినియోగించుకోనున్నాయి. కాగా, జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్లో 49 శాతం వాటాను రూ.10,780 కోట్లతో గతేడాది గ్రూపే ఏడీపీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్రస్తుతం జీఎమ్మారే నిర్వహిస్తున్నది.