హైదరాబాద్, సెప్టెంబర్ 8: ఫ్రీడమ్ పేరుతో వంటనూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా.. తాజాగా మార్కెట్లోకి రిఫైండ్ రైస్ బ్రాస్ ఆయిల్ 5 లీటర్ జార్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వంటనూనె చెడు కొలెస్ట్రాల్తో పోరాడుతుంది..మంచి కొలెస్ట్రాల్ స్థాయిని వృద్ధి చేస్తున్నదన్న సందేశంతో ఈ వంటనూనెకు ప్రచారం కల్పిస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..ఈ నూతన ఫ్రీడమ్ రైస్ బ్రాస్ ఆయిల్ 5 లీటర్ జార్ను ప్రత్యేకంగా దేశీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. భారత్లో 21 మిలియన్ టన్నుల వంటనూనెను వినియోగిస్తుండగా, దీంట్లో కేవలం 7-8 మిలియన్ టన్నులు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నదని, మిగతా అంతా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. కరోనా వైరస్తో కమర్షియల్ వంటనూనె వాడకం భారీగా తగ్గిందన్నారు.