జవగళ్ శ్రీనాథ్ తదితరులకు వాటా
న్యూఢిల్లీ: ట్విట్టర్కు బదులుగా భారత్లో వచ్చిన ‘కూ’లో చైనా వాటాలను టీమిండియా మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్సహా పలువురు సొంతం చేసుకున్నారు. కూ మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో చైనాకు చెందిన షున్వీ క్యాపిటల్కు 9 శాతానికిపైగా వాటా ఉన్నది. దీన్నిప్పుడు శ్రీనాథ్తోపాటు ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి, బుక్మైషో అధిపతి ఆశిష్ హేమ్జ్రనీ, ఉడాన్ సహవ్యవస్థాపకుడు సుజీత్ కుమార్, జెరోధా అధినేత నిఖిల్ కామత్ కొనుగోలు చేశారు. అయితే ఎంతకు కొన్నారన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కూ యాక్టివ్ యూజర్లు దాదాపు 45 లక్షలుగా ఉన్నారు. తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో కూ సేవలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.