న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఇన్ఫ్రాకు, ప్రత్యేకించి రోడ్డు ప్రాజెక్టులకు నిధులందించేందుకు రిజర్వుబ్యాంక్ వద్దనున్న విదేశీ కరెన్సీ (ఫారెక్స్) నిల్వల్ని ఉపయోగించేలా ఒక విధానాన్ని తీసుకురావాల్సివుందని కేంద్ర రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన సీఐఐ వార్షిక సదస్సులో మాట్లాడుతూ దేశం వద్ద మిగులు డాలరు నిల్వలున్నాయని, ఈ విదేశీ కరెన్సీని ఇన్ఫ్రా అభివృద్ధికోసం వినియోగించడానికి ఒక విధానాన్ని ఎలా రూపొందించాలన్న అంశమై తాను ఆర్బీఐ గవర్నర్తో చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.