Ford India | ఇండియాలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ చెన్నై యూనిట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. చెన్నైకి సమీపంలోని మరాయిమలాయి నగర్లో గల ఈ యూనిట్ను మరో కంపెనీకి విక్రయించాలని ఫోర్డ్ ఇండియాను తమిళనాడు ప్రభుత్వం కోరింది. అదే జరిగితే ఆ యూనిట్లో పని చేస్తున్న 2600 మంది ఉద్యోగులకు రిలీఫ్ లభించినట్లే.
వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి చెన్నై యూనిట్లో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు ఫోర్డ్ ఇండియా తెలిపింది. ఈ యూనిట్ విక్రయానికి ఫోర్డ్ ఇండియాకు మంచి డీల్ లభిస్తే.. ఇదే స్థలాన్ని సదరు ఆటోమొబైల్ కంపెనీకి కేటాయిస్తామని తమిళనాడు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ మురుగానందం మీడియాకు చెప్పారు.
ఫోర్డ్ ఇండియా కార్ల ఉత్పాదక కాంట్రాక్ట్ లేదా యూనిట్ విక్రయం కోసం ఓలా, మహీంద్రా అండ్ మహీంద్రాతో చర్చలు జరిగాయి. ఈ మూడు సంస్థల మధ్య జరిగిన చర్చల ఫలితం ఏమిటన్నది బయటకు రాలేదు. ఫోర్డ్ ఇండియా మూసివేతతో నేరుగా 4000 మంది, పరోక్షంగా 40 వేల మంది జీవితాలపై ప్రభావం పడనుందని తెలుస్తున్నది. గుజరాత్లోని సనంద్ యూనిట్ ప్రస్తుత త్రైమాసికంలోనే మూత పడనున్నది.
చెన్నై ఫోర్డ్ ఇండియా యూనిట్ ఏడాదిలో రెండు లక్షల కార్లు, 3.40 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఫోర్డ్ ఏండీవర్ వేరియంట్ కార్ల ఉత్పత్తి కోసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టింది. సనంద్ యూనిట్ 2.40 లక్షల కార్లు, 2.70 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 37 దేశాలకు ఈ కార్లను ఎగుమతి చేయాలని ఫోర్డ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
IT Returns | బిగ్ రిలీఫ్.. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించిన కేంద్రం
RBI rule on ATM | గ్రామీణులకు షాక్.. ఏటీఎంలు ఎత్తేస్తున్న బ్యాంకులు?!