న్యూఢిల్లీ: మీరు ఏదేనీ బ్యాంకులో కొత్తగా సేవింగ్స్ ఖాతా తెరుస్తున్నారా.. ఆయా బ్యాంకులు మీ సేవింగ్స్ ఖాతాలో జమ చేసే మొత్తంపై వడ్డీ ఇస్తాయి. కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై కంటే సేవింగ్స్ ఖాతాలపైనే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా రూ.5.4 శాతం వడ్డీ అందిస్తున్నాయి. వివిధ బ్యాంకులు అందించే వడ్డీరేట్లను ఒకసారి పరిశీలిద్దాం..
సేవింగ్స్ ఖాతాలపై ఆర్బీఎల్ బ్యాంక్ 4.50-6.25శాతం, బంధన్ బ్యాంక్ 3.00-6.00 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 4.00-6.00 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఇక యస్ బ్యాంక్ 4.00-5.50 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 4.00-5.00 శాతం, పోస్టాఫీసు 4, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.00-4.00 శాతం మధ్య వడ్డీ అందిస్తున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.00- 3.50 శాతం మధ్య, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.90 శాతం, ఎస్బీఐ 2.70 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఆదాయం పన్ను చట్టంలోని 80టీటీఏ సెక్షన్ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే రూ.10 వేల డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది.
మీరు ఒక బ్యాంకులో గానీ, కో ఆపరేటివ్ సొసైటీలో గానీ, పోస్టాఫీసులో గానీ ఈ సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఉమ్మడి హిందూ కుటుంబం (హెచ్యూఎఫ్)లో సభ్యులైనా, 60 ఏండ్ల లోపు వయస్కులైనా ఈ ఆఫర్ లభిస్తుంది. వ్రుద్ధులకు రూ50 వేల వరకు రాయితీ ఉంటుంది. పరిధి దాటితే టీడీఎస్ కట్ అవుతుంది.
వడ్డీతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లు రూ.10వేలకుపైగా ఉన్నా పన్ను విధించరు. సీనియర్ సిటిజన్లు 15 హెచ్, ఇతరులు 15 జీ ఫామ్ సమర్పించాలి. ఫామ్ 15జీ లేదా ఫామ్ 15 హెచ్ సెల్ఫ్ డిక్లేర్డ్ ఫామ్.