న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లు మన జీవితాన్ని తేలిక చేశాయి. ఒక పిజ్జా లేదా మనకు నచ్చిన ఐస్క్రీమ్ తినడానికి రెస్టారెంట్కు పరుగెత్తాల్సిన అవసరం లేకుండా చేసేశాయి. యాప్స్ రాకతో లభించిన సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాం.. డెలివరీ బాయ్ అన్ని సుసాధ్యం చేస్తుండటంతో రెస్టారెంట్కు, మన ఇంటికి మధ్య దూరాన్ని మర్చిపోతున్నాం..తరుచుగా పొరపాట్లు చేస్తున్నాం కూడా..
ఫుడ్ డెలివరీ యాప్స్ను ఉపయోగించే కస్టమర్లు తరుచుగా చేసే పెద్ద పొరపాట్లను అమెరికాలోని ఓ డెలివరీ ఏజెంట్ బయట పెట్టారు. కస్టమర్లు తాము చేసే పొరపాట్లు పెద్దవి కాదని భావిస్తుండొచ్చు గానీ ఫుడ్ డెలివరీ బాయ్లు, ఏజంట్లకు పలు సమస్యలు తెచ్చి పెడతారని చెప్పాడు.
కరోనా మహమ్మారి విజ్రుంభిస్తున్నప్పుడు మిగతా వారి మాదిరిగానే అన్నే సింగ్ కూడా పూర్తికాలపు ఉద్యోగాన్ని కోల్పోయారు. దీంతో పోస్ట్మ్యాట్స్ అనే ఫుడ్ డెలివరీ కంపెనీలో సేవలందించారు. ఆమెకు సొంతంగా మార్కెటింగ్ సంస్థ ఉన్నా.. తన బిజినెస్కు సపోర్ట్గా పార్ట్టైం ఫుడ్ ఆర్డర్స్ డెలివరీ ఏజెంట్గా పని చేశారు.
పోస్ట్మ్యాట్స్లో డెలివరీ ఏజంట్గా తాను ఎదుర్కొన్న అనుభవాలే మిగతా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లోని ఏజెంట్లు ఫేస్ చేసి ఉంటారని అన్నే సింగ్ చెప్పారు. డెలివరీ పర్సన్ భద్రత, రక్షణ పట్ల కస్టమర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లు.. తమ ఇల్లు, ఇంటి నంబర్ బయట నుంచి చూసే వారికి తేలిగ్గా కనిపించే ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. మీ ఇల్లు చీకట్లో ఉంటే, బయట అంతా వెలిగి పోయేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఫుడ్ డెలివరీ ఏజంట్గా తాను తరుచుగా సంబంధిత అడ్రస్లు కనుక్కునేందుకు కారులో నుంచి బయటకు వచ్చి చీకట్లో నడవాల్సి వచ్చేదన్నారు. కస్టమర్లు తమ ఆర్డర్లతోపాటు డెలివరీకి ఎటువంటి సూచనలు పేర్కొనరని ఆవేదన వ్యక్తం చేశారు.
క్లిష్టమైన పరిస్థితుల్లో కస్టమర్ల అడ్రస్ కనుక్కోవడం కష్టంగా మారుతుందన్నారు. కస్టమర్లు రద్దీ సమయాల్లోనే ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ జాప్యం అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. కానీ అన్నే సింగ్ మాత్రం రద్దీ టైంలో కూడా సకాలంలో ఫుడ్ డెలివరీ చేసినట్లు తెలిపారు.
7న మోదీ క్యాబినెట్ విస్తరణ.. ముగ్గురు మాజీ సీఎంలకు చోటు?!
ఇతర దేశాలకు అందుబాటులో కోవిన్ పోర్టల్: ప్రధాని మోదీ
స్పీకర్పై చేయి చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. 12 మందిపై ఏడాది వేటు
హక్కుల నేత స్టాన్ స్వామి మృతి
నా వాళ్లే నాకు ద్రోహం చేశారు: చిరాగ్ పాశ్వాన్
జమ్మూ వైమానిక స్థావరంపై ఆర్డీఎక్స్, నైట్రేట్తో డ్రోన్ల దాడి
రూ.37 లక్షల బైక్.. 24 గంటల్లోనే బుకింగ్స్ క్లోజ్
అమెజాన్ సీఈవో పదవికి బెజోస్ గుడ్బై.. ఎందుకు? ఆయన భవిష్యత్తు ఏంటి?
వ్యక్తిగత జీవితంపై వర్క్ ఫ్రం హోం ప్రభావం
3జీ, 4జీ, 5జీ తెలుసు.. మరి ‘జీరో’ జీ ఉందని తెలుసా !
ఏటీఎం కార్డు లేకుండా డబ్బు విత్డ్రా చేయాలా?
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
మన దగ్గరేమో వానలు.. ఢిల్లీ , అమెరికాలో భానుడి భగభగ.. కారణమేంది?
హైదరాబాద్లో బంగారం ధర రూ.44,300..!