న్యూఢిల్లీ, ఆగస్టు 24: కిరాణాలు, రిటైలర్ల కోసం ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ఓ సరికొత్త రుణ పథకాన్ని తీసుకొచ్చింది. మంగళవారం ఈ వాల్మార్ట్కు చెందిన డిజిటల్ బీటుబీ మార్కెట్ వేదిక ప్రకటించిన వివరాల ప్రకారం కిరాణా దుకాణదారులు తమ రోజువారీ నగదు అవసరాలను ఈ రుణాలతో తీర్చుకోవచ్చు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇతర ఫిన్టెక్ సంస్థల భాగస్వామ్యంతో ‘ఈజీ క్రెడిట్’సహా పలు క్రెడిట్ ఆఫర్లను దేశవ్యాప్తంగా ఉన్న కిరాణాలకు ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అందుబాటులోకి తెచ్చింది. 14 రోజుల వరకు వడ్డీ లేకుండా రూ.5 వేల నుంచి 2 లక్షల వరకు అప్పును పొందవచ్చు. తద్వారా తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అధిపతి ఆదర్శ్ మీనన్ తెలిపారు.