న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు పరిహారం కింద 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. పన్ను చట్టాల వికేంద్రీకరణ తర్వాత రాష్ట్రాలకు వచ్చే ఆదాయం లోటును ప్రతి నెలా భర్తీ చేయాలని 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన సంగతి తెలిసింది. దీంతో ఇప్పటి వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ.59,226 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం తెలిపింది.
ఈ నిధులు అందుకునే రాష్ట్రాలివి: ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ.1,18,452 కోట్ల పరిహారం విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!