రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
కళా-2021’ను పరిశీలించిన కమాన్చౌరస్తా, మార్చి 20 : మహిళలు తమకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్స్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పేర్కొన్నారు. నాబార్డ్ సౌజన్యంతో నగరంలోని రెవెన్యూ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ‘కళా-2021’ను ఆయన శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా మేళాలోని ప్రతి స్టాల్ను పరిశీలించారు. మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, వాటి తయారీకి ముడిసరుకులు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు?, వినియోగిస్తున్న పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వస్తువులను మార్కెటింగ్ చేసేందుకు నాబార్డ్ మంచి కార్యక్రమం చేపట్టిందని, దీనితోపాటు బ్యాంకులు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, స్వశక్తి సంఘాలు తయారు చేసిన వస్తువులు ప్రజలకు అందుబాటులో, అతి తక్కువ ధరకు దొరుకుతున్నాయని చెప్పారు. రెండో సారి ఏర్పాటు చేసిన కళా మేళాకు మంచి స్పందన వస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కళా-2021 ముగింపు సందర్భంగా మేళాలో స్టాల్స్ను ఏర్పాటు చేసిన సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్ రావు, నాబార్డ్ ఏజీఎం అనంత్, కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ సీఈవో సత్యనారాయణ రావు, జీఎం శ్రీధర్, డీజీఎం బ్రహ్మానందరావు తదితరులు పాల్గొన్నారు.