E-Commerce Sales | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఈ-కామర్స్లోనే తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల్లో వస్తువుల కొనుగోళ్లు రూ.32 వేల కోట్లు జరిగాయి. గతేడాది అంటే 2020 సేల్స్ ప్రకారం ఈ ఏడాది 23 శాతం పెరిగాయి. కానీ 2016-17 తర్వాత 20 శాతం సేల్స్లో అత్యధిక విక్రయాల్లో రెండో స్థానం.
గ్రాస్ మర్చండైజ్ వాల్యూ (జీఎంవీ) గ్రోత్ 2017-18లో 150 శాతం, 2018-19లో 27, 2019-20లో 37 శాతం పెరిగిందని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ రెడ్ సీర్ వెల్లడించింది. 8.5 లక్షల మందికి పైగా అమెజాన్ సెల్లర్స్, 3.75 లక్షలకు పైగా ఫ్లిప్కార్ట్ సెల్లర్స్ ఈ ఏడాదిలో భాగస్వాములయ్యారు. ఫెస్టివ్ సీజన్లో ఈ ఏడాది అత్యధికంగా ఫ్లిప్కార్ట్ 64 శాతం, అమెజాన్ 28 శాతం, ఇతర ప్లాట్ఫామ్స్ 8 శాతం సేల్స్ జరిపాయి.