తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఖిలావరంగల్, ఏప్రిల్ 10 : వరంగల్ మహానగరంలో సోమవారం జరిగే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని తూర్పు నియోజక వర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో శనివారం శివనగర్ సాయి కన్వెన్షన్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.350కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దేనన్నారు. ప్రజల కోసం పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనలో కరోనా జాగ్రత్తలు పాటించాలని, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనుల వద్ద కేటాయించిన నాయకులు మాత్రమే ఉండాలని సూచించారు.
సారంగపాణి కుటుంబానికి పరామర్శ
వరంగల్ చౌరస్తా : 24వ డివిజన్ మట్టెవాడ ప్రాంతానికి చెందిన కేఎంసీ వైరాలజీ ల్యాబ్ టెక్నీషియన్ సారంగపాణి శుక్రవారం ఎంజీఎంలో మృతి చెందగా శనివారం ఉదయం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సారంగపాణి మృతదేహం వద్ద నివాళులర్పించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సారంగపాణి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించడంతో స్పందించిన ఎమ్మెల్యే ఆయన మృతికి గల కారణాలను గుర్తించాలని మట్టెవాడ పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ నాయకులు మసూద్, బొల్లం రాజు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
సూళ్లూరుపేటలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం