వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులు సుదీర్ఘ కాలం పాటు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించింది. తమ ఉద్యోగులు విదేశాలకు వెళ్లి పని చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.
కోవిడ్-19 ముప్పు వల్ల గతేడాది ప్రారంభం నుంచి ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా దిగ్గజాలు, ఐటీ- టెక్ దిగ్గజాలు.. సిలికాన్ వ్యాలీ కంపెనీలు తమ సిబ్బందిని ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 15 నుంచి శాశ్వతంగా తమ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు అనుమతినిస్తున్నట్లు వార్తా సంస్థ ఏఎఫ్పీకి తెలిపింది. సిబ్బంది అమెరికా నుంచి కెనడాకు, బ్రిటన్ నుంచి ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలకు షిఫ్ట్ అయ్యేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది.
తమ సిబ్బంది ఎక్కడ నుంచి పని చేస్తున్నారన్న దానికంటే ఎలా పని చేస్తున్నారన్నదే తమకు ముఖ్యమని నమ్ముతామని ఫేస్బుక్ పేర్కొంది. ఒకవేళ కోవిడ్-19 ముప్పు తొలిగి కార్యాలయాలు తెరిచినా వర్క్ ఫ్రం హోంకు అనుమతినిస్తామని తెలిపింది.
కరోనా ముప్పు నేపథ్యంలో ఏడాది క్రితం మూత పడ్డ తమ ఆఫీసులను ఇటీవలే ఫేస్బుక్ తెరిచింది. వారికి ఫ్రీ ఫుడ్, ఉద్యోగులకు కమ్యూటర్స్ షటిల్స్ తదితర వసతులేమీ ఆఫర్ చేయలేదు. వచ్చే సెప్టెంబర్ నుంచి అమెరికాలోని కార్యాలయాల్లో 50% సిబ్బందిని అనుమతించాలని ఫేస్బుక్ భావిస్తున్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
సివిల్స్ 2020 : ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
35 ఏండ్ల క్రితం : లార్డ్స్లో తొలి టెస్ట్ విజయం చిరస్మరణీయం
ఇంద వంద : గడ్డం కాదు మోదీజీ, ఉపాధి పెంచండి..
మా పెళ్లి చెల్లదు : భర్త నుంచి విడిపోయిన ఎంపీ నుస్రత్
పెద్ద పొరపాటు : నోరు జారిన కేంద్ర మంత్రి గడ్కరీ
కొత్త రికార్డ్ : పది మందికి జన్మనిచ్చిన సౌతాఫ్రికా మహిళ
ఓపెన్ టాక్ : గొడ్డు మాంసం తినడం మాకు రాజ్యాంగబద్ధమైన హక్కు
హెల్మెట్ను నోట్లోకి లాగేసిన ఏనుగు.. వీడియో వైరల్
ఇక నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి.. ఎల్పీజీ రీఫిల్
ఫ్లిప్కార్ట్కు పోటీగా అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ సేల్!
ost Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి