ఊరిస్తున్న ఈ-స్కూటర్లు

ఈ ఏడాది రానున్న మోడళ్లు ఇవే
చిన్న చిన్న పనుల నిమిత్తం బజారుకో, మార్కెట్లకో వెళ్లాలన్నా, పిల్లలను పాఠశాలలో దింపిరావాలన్నా ఎక్కువ మంది ప్రధానంగా ఎంచుకునేది స్కూటర్లనే. సులభంగా డ్రైవింగ్ చేసేందుకు స్కూటర్లు అనువుగా ఉండటం, సామాన్లు తెచ్చుకునేందుకు తగినంత స్పేస్ ఉండటం ఇందుకు ముఖ్య కారణం. కానీ, పెట్రోల్ ధరలు రోజు రోజుకూ మండిపోతుండటంతో చాలా మంది విద్యుత్తో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతున్న కొన్ని ప్రధాన ఈ-స్కూటర్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
సింపుల్ ఎనర్జీ మార్క్-2
బెంగళూరు స్టార్టప్ సింపుల్ ఎనర్జీ.. మే నెలలో ‘మార్క్-2’ ఈ-స్కూటర్ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నది. ధర రూ.90 వేలు, రేంజ్ 240 కి.మీ., టాప్ స్పీడ్ గంటకు 100 కి.మీ.
యాక్టివా ఎలక్ట్రిక్
జపాన్కు కంపెనీ హోండా.. త్వరలో ‘యాక్టివా ఎలక్ట్రిక్' స్కూటర్ను అందుబాటులోకి తీసుకురానున్నది. దీని రేంజ్ దాదాపు 90 నుంచి 100 కి.మీ.
బర్గ్మ్యాన్ ఎలక్ట్రిక్
జపాన్కే చెందిన సుజుకీ సంస్థ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘ఎలక్ట్రిక్ బర్గ్మ్యాన్'ను తీసుకురానున్నది. దీని ధర దాదాపు రూ.1.3 లక్షలు, రేంజ్ 75-80 కి.మీ.
వెస్పా ఎలెక్ట్రికా
ఇటలీకి కంపెనీ వెస్పా త్వరలో ‘వెస్పా ఎలెక్ట్రికా’ ఈ-స్కూటర్ను మార్కెట్లోకి తీసుకురానున్నది. దీని ధర దాదాపు రూ.1.5 లక్షలు.
మ్యాస్ట్రో ఎలక్ట్రిక్
దేశీయ సంస్థ హీరో మోటోకార్ప్.. ఈ ఏడాది మధ్య నాటికి ‘మ్యాస్ట్రో ఎలక్ట్రిక్' స్కూటర్ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నది. దీని ధర దాదాపు రూ.లక్ష. లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉండే ‘మ్యాస్ట్రో ఎలక్ట్రిక్'.. 110 సీసీ పెట్రోల్ ఇంజిన్తో నడిచే స్కూటర్కు సమానమైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ చెప్తున్నది.
హీరో ఎలక్ట్రిక్ ఏఈ-29
హీరో నుంచే మార్చి నెలలో ‘హీరో ఎలక్ట్రిక్ ఏఈ-29’ ఈ-స్కూటర్ కూడా అందుబాటులోకి రానున్నది. ధర దాదాపు రూ.85 వేలు. రేంజ్ సుమారు 80 కి.మీ.
తాజావార్తలు
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
- మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు.. 38 మరణాలు