హైదరాబాద్, సెప్టెంబర్ 15: హైదరాబాద్లో దేశంలోనే తొలి క్యాన్సర్ న్యూట్రీషన్ రిసెర్చ్ సెంటర్ను ఎస్పరర్ న్యూట్రీషన్ (ఈవోఎన్) ఏర్పాటు చేసింది. ఈ అత్యుత్తమ సెంటర్తో క్యాన్సర్ రోగుల జీవన ప్రమాణాల్ని పెంచుతామని, మరింతకాలం వారు ఆనందంగా జీవించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక సీఈవో రక్తిం చటోపాధ్యాయ్ అన్నారు. పశ్చిమ దేశాల్లో కంటే భారత్లో క్యాన్సర్ మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు. క్యాన్సర్ మహమ్మారిని అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.