జమ్మికుంట/భీమదేవరపల్లి, జూలై 6: కరీంనగర్ జిల్లా జమ్మికుంటను అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ తెలిపారు. పట్టణం చుట్టూ రింగ్రోడ్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని 4, 5వ వార్డులు, వీణవంక మండలం ఘన్ముక్ల, బొంతుపల్లిలో జరిగిన పట్టణ, పల్లె ప్రగతిలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గినా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వినోద్కుమార్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు వెళ్లూ మార్గమధ్యలో వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లిలో రోడ్డు పక్కన రైతులను పలుకరించారు. రైతుబంధు పథకం తమ జీవితాన్ని మార్చివేసిందని, పెట్టుబడి సాయం వల్లే పడావుగా ఉన్న భూములన్నీ చదును చేసి సాగుకు యోగ్యంగా మార్చుకుంటున్నామని రైతులు నూనె కనుకయ్య ముదిరాజ్, గాజు అరవింద్ యాదవ్ తెలిపారు. రైతుల మాటలకు వినోద్కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.