హైదరాబాద్: మాజీ రంజీ ఆటగాడు అశ్విన్ యాదవ్ గుండెపోటుతో మృతిచెందాడు. 33 ఏండ్ల అశ్విన్ 2007-2009 మధ్య రంజీల్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పేస్బౌలర్గా 14 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడిన అశ్విన్ 34 వికెట్లు పడగొట్టాడు. లీగ్ల్లో ఎస్బీఐ తరుఫున ఆడిన అశ్విన్.. ఓవరాల్గా 10 లిస్ట్-ఎ మ్యాచ్లు, రెండు టీ20లు ఆడాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ‘అశ్విన్ యాదవ్ మరణ వార్త చాలా బాధాకరం. రంజీ జట్టులో అందరితో సరదాగా ఉండేవాడు. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని భారత ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ట్వీట్ చేశాడు.