ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఈశాన్య రాష్ట్రాల ట్రిప్ ను గుర్తు చేసుకున్నాడు. అనుభవ్ సిన్హా డైరెక్షన్ చేస్తున్న సినిమా షూటింగ్ ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న టైంలో లొకేషన్ లో దిగిన స్టిల్ ను షేర్ చేశాడు. అనేక్ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు ప్రకృతి ఒడిలో పరవశించిపోయా.
కజిరంగా నేషనల్ పార్కు, షిల్లాంగ్ దగ్గర చూసిన ప్రకృతి సౌందర్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఓ ప్రకృతి ప్రేమికుడిగా, మన దేశంలో ఉన్న అందాన్ని చూసి నేను విస్మయం చెందాను. ఇది చాలా అందంగా ఉంది అని ఆయుష్మాన్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో నా పర్యటన ప్రకృతికి అనుగుణంగా ఉండటం ద్వారా వన్యప్రాణి ప్రేమికుడిగా నా కలలు సాధించగలిగినట్టైంది అని చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్. రోడ్డు పరిసర ప్రాంతాలను తన కెమెరాలో బంధించిన మరో స్టిల్ ను కూడా పోస్ట్ చేశాడు.
ఇవి కూడా చదవండి..
భూమిక పేరు సూచించిన సల్మాన్ఖాన్..ఎందుకో తెలుసా..?
గ్లామరస్ లుక్లో అనన్య..స్టిల్స్ చక్కర్లు
రామ్ దగ్గరకు వెళ్లిన అల్లు అర్జున్ స్టోరీ..!
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!